14, ఏప్రిల్ 2024, ఆదివారం

My Vijayawada

 In the heart of Andhra Pradesh, where the mighty Krishna River flows,

Lies the enchanting city of Vijayawada, where beauty gracefully grows.


At dawn, the city awakens with the gentle kiss of the morning sun,

And the echoes of history whisper tales of battles fought and won.


The Kanaka Durga Temple, perched atop Indrakeeladri Hill so high,

Stands as a testament to devotion under the vast azure sky.


Below, the tranquil waters of the Krishna River gently glide,

Reflecting the vibrant hues of Vijayawada's pride.


The Prakasam Barrage, a marvel of engineering grand,

Spanning the river's breadth, where serenity meets the land.


Gandhi Hill stands tall, a beacon of peace and unity,

Offering panoramic views of Vijayawada's bustling beauty.


The rail bridge spans the river, connecting hearts and souls,

As trains rumble across, their journeys weaving tales untold.


Ambedkar's statue, a symbol of equality and hope,

Stands as a reminder that progress is within our scope.


Raghavayya Park, where children's laughter fills the air,

With blossoming flowers and shady trees, a sanctuary so fair.


Gunadala Matha Shrine, a place of solace and prayer,

Where devotees seek blessings, their faith beyond compare.


Bhavani Island, a verdant oasis amidst the flowing stream,

A haven for nature lovers, where one can dream.


Durga Ghats, where pilgrims bathe in sacred waters divine,

Cleansing their souls, under the warm sunshine.


Vijayawada, with its blend of tradition and modernity,

A city where heritage thrives with boundless vitality.


From its ancient temples to its bustling streets,

Vijayawada's beauty is a tapestry of myriad treats.


In every corner, a story waits to be told,

Of a city whose charm never grows old.


So let us cherish Vijayawada, with all its grace and might,

A city that fills our hearts with sheer delight.



The Misadventures of Detective Dudley

Episode 1: The Case of the Missing Cat Detective Dudley sat at his cluttered desk, nursing his third cup of coffee that morning. The rain pounded against the window, mirroring his dreary mood. Business had been slow lately, and Dudley was itching for a case to sink his teeth into. Just as he was about to doze off, the door to his office burst open, revealing a frazzled old lady clutching a wet umbrella. "Detective Dudley!" she cried, "You have to help me! My precious cat, Mr. Whiskers, has gone missing!" Dudley straightened up, his interest piqued. A missing cat wasn't exactly the high-profile case he was hoping for, but it would have to do. With a sigh, he grabbed his coat and followed the old lady out into the rainy streets. Little did Dudley know, this seemingly mundane case would be the beginning of a wild adventure filled with twists, turns, and a healthy dose of comedy. As Dudley trudged through the rain, he couldn't shake the feeling that there was more to this case than met the eye. Little did he know, the mystery of Mr. Whiskers' disappearance was just the tip of the iceberg. Episode 2: The Curious Clue After hours of searching, Dudley finally stumbled upon a clue—a tuft of fur caught on a nearby fence. His keen detective instincts kicked into gear as he carefully collected the evidence. Back at his office, Dudley examined the fur under a magnifying glass, his brow furrowed in concentration. Suddenly, he gasped as he realized the fur belonged to none other than Mr. Whiskers himself! But how could that be possible? Dudley pondered this new development, his mind racing with possibilities. Little did he know, the truth was stranger than fiction, and Mr. Whiskers' disappearance was just the beginning of a much larger conspiracy. Episode 3: The Peculiar Suspect Dudley's investigation led him to a rundown apartment building on the outskirts of town. As he approached, he noticed a suspicious figure lurking in the shadows—a shifty-looking man with a penchant for wearing trench coats and fedoras. Dudley's intuition told him this man was hiding something, and he was determined to get to the bottom of it. With a steely glint in his eye, Dudley confronted the man, demanding answers. To his surprise, the man readily confessed to kidnapping Mr. Whiskers—but there was a twist. As it turned out, the man wasn't acting alone. He was merely a pawn in a much larger game, and Mr. Whiskers' disappearance was just the beginning of a much larger conspiracy. Episode 4: The Cryptic Note As Dudley delved deeper into the case, he stumbled upon a cryptic note hidden beneath the floorboards of the suspect's apartment. The note was written in a language he couldn't decipher, but one thing was clear—it was a clue to something much bigger than he could have ever imagined. Determined to crack the code, Dudley enlisted the help of his trusty sidekick, a bumbling yet lovable intern named Charlie. Together, they spent hours poring over the note, trying to unravel its secrets. But just as they were on the brink of a breakthrough, disaster struck. The note mysteriously vanished, leaving Dudley and Charlie back at square one. Episode 5: The Unexpected Ally Just when all hope seemed lost, Dudley received a mysterious phone call from an unexpected ally—a reformed criminal with a knack for cracking codes. With his help, Dudley and Charlie were able to decipher the cryptic note, revealing a shocking revelation—the true mastermind behind Mr. Whiskers' disappearance was none other than Dudley's arch-nemesis, the infamous Cat Burglar! Determined to put an end to the Cat Burglar's reign of terror once and for all, Dudley enlisted the help of every detective in town, forming an unlikely alliance to take down their common enemy. Episode 6: The Final Showdown Armed with the knowledge of the Cat Burglar's true identity, Dudley and his ragtag team of detectives launched a full-scale assault on the villain's lair. As they fought their way through wave after wave of henchmen, Dudley couldn't help but marvel at the sheer absurdity of it all. Little did he know, the biggest twist was yet to come. Just as they reached the inner sanctum of the Cat Burglar's lair, they were met with a shocking revelation—the Cat Burglar was none other than... Mr. Whiskers himself! Episode 7: The Ultimate Twist As Dudley stared in disbelief at the now-revealed mastermind behind the entire conspiracy, he couldn't help but feel a sense of admiration for the cunning cat. It turned out that Mr. Whiskers had orchestrated the entire scheme in order to bring attention to the plight of stray animals in the city. And while his methods may have been unorthodox, there was no denying the impact he had made. With the case finally solved, Dudley bid farewell to his feline foe, grateful for the adventure they had shared. And as he watched Mr. Whiskers disappear into the night, he couldn't help but wonder what other mysteries awaited him in the future. And so, with a newfound sense of purpose, Detective Dudley set off into the night, ready to face whatever challenges came his way. For in a city as strange and unpredictable as this one, there was never a dull moment for a detective like him.

3, ఫిబ్రవరి 2021, బుధవారం

సృష్టి రహస్య విశేషాలు.


1  సృష్టి  ఎలా  ఏర్పడ్డది
2  సృష్టి  కాల చక్రం  ఎలా నడుస్తుంది
3  మనిషిలో  ఎన్ని  తత్వాలున్నాయి

( సృష్ఠి )  ఆవిర్బావము.
1  ముందు  (పరాపరము) దీనియందు శివం పుట్టినది
2  శివం యందు  శక్తి
3  శక్తి యందు నాధం
4  నాధం యందు బిందువు
5  బిందువు యందు సదాశివం
6  సదాశివం యందు మహేశ్వరం
7  మహేశ్వరం యందు ఈశ్వరం
8  ఈశ్వరం యందు రుద్రుడు
9  రుద్రుని యందు విష్ణువు
10 విష్ణువు యందు బ్రహ్మ
11  బ్రహ్మ యందు ఆత్మ
12  ఆత్మ యందు దహరాకాశం
13  దహరాకాశం యందు వాయువు
14  వాయువు యందు అగ్ని
15  ఆగ్ని యందు జలం
16  జలం యందు పృథ్వీ. 
17. పృథ్వీ యందు ఓషధులు
18. ఓషదుల వలన అన్నం
19. ఈ అన్నము వల్ల...... నర ,  మృగ , పశు , పక్షి  ,వృక్ష , స్థావర జంగమాదులు పుట్టినవి.

( సృష్ఠి ) కాల చక్రం.
పరాశక్తి ఆదీనంలో నడుస్తుంది.
ఇప్పటివరకు ఎంతో మంది శివులు  
ఎంతోమంది విష్ణువులు  
ఎంతోమంది బ్రహ్మలు వచ్చారు 
ఇప్పటివరకు 50 బ్రహ్మలు వచ్చారు.
ఇప్పుడు నడుస్తుంది 51 వాడు.

1 కృతాయుగం
2 త్రేతాయుగం
3 ద్వాపరయుగం
4 కలియుగం

నాలుగు యుగాలకు 1 మహయుగం.
71 మహ యుగాలకు 1మన్వంతరం.
14 మన్వంతరాలకు ఒక సృష్ఠి (ఒక కల్పం.)
15 సందులకు ఒక ప్రళయం (ఒక కల్పం)
1000 యుగాలకు బ్రహ్మకు పగలు (సృష్ఠి) .  
1000 యుగాలకు ఒక రాత్రి  (ప్రళయం.)
2000 యుగాలకు ఒక దినం.
ఇప్పుడు బ్రహ్మ వయస్సు 51 సం.

ఇప్పటివరకు 27 మహ యుగాలు గడిచాయి.
1 కల్పంకు 1 పగలు 432 కోట్ల సంవత్సరంలు.
7200 కల్పాలు బ్రహ్మకు 100 సంవత్సరములు.
14 మంది మనువులు.
ఇప్పుడు వైవస్వత మనువులో ఉన్నాం. 
శ్వేతవరాహ యుగంలో ఉన్నాం.

5 గురు భాగాన కాలంకు 60 సం
1 గురు భాగాన కాలంకు 12 సం
1 సంవత్సరంకు 6 ఋతువులు.
1 సంవత్సరంకు  3 కాలాలు.
1 రోజుకు 2 పూటలు పగలు  రాత్రి
1 సం. 12 మాసాలు.
1 సం.  2 ఆయనాలు
1సం. 27 కార్తెలు
1 నెలకు 30 తిధులు
27 నక్షత్రాలు - వివరణలు
12 రాశులు
9 గ్రహాలు
8 దిక్కులు
108 పాదాలు
1 వారంకు 7 రోజులు

పంచాంగంలో 1 తిధి. 2 వార.  3 నక్షత్రం.  4 కరణం.  5 యోగం.

సృష్ఠి యావత్తు త్రిగుణములతోనే ఉంటుంది.
దేవతలు   జీవులు  చెట్లలో అన్ని వర్గంలలో మూడే గుణములు ఉంటాయి.
1  సత్వ గుణం 
2  రజో గుణం
3  తమో గుణం

( పంచ భూతంలు ఆవిర్భావం )
1 ఆత్మ యందు ఆకాశం 
2 ఆకాశం నుండి వాయువు
3 వాయువు నుండి అగ్ని
4 అగ్ని నుండి జలం
5 జలం నుండి భూమి అవిర్బవించాయి.

5  ఙ్ఞానేంద్రియంలు
5  పంచ ప్రాణంలు
5  పంచ తన్మాత్రలు
5  ఆంతర ఇంద్రియంలు
5  కర్మఇంద్రియంలు  = 25 తత్వంలు

1  ( ఆకాశ పంచికరణంలు )
ఆకాశం - ఆకాశంలో కలవడం వల్ల      ( జ్ఞానం )
ఆకాశం - వాయువులో కలవడం వల్ల  ( మనస్సు )
ఆకాశం - అగ్నిలో కలవడం వల్ల          ( బుద్ది )
ఆకాశం - జలంతో కలవడంవల్ల          ( చిత్తం )
ఆకాశం - భూమితో కలవడంవల్ల        ( ఆహంకారం ) పుడుతుతున్నాయి

2( వాయువు పంచీకరణంలు )
వాయువు - వాయువుతో కలవడం వల్ల  ( వ్యాన)
వాయువు - ఆకాశంతో కలవడంవల్ల       ( సమాన )
వాయువు - అగ్నితో కలవడంవల్ల           ( ఉదాన )
వాయువు - జలంతో కలవడంవల్ల          ( ప్రాణ )
వాయువు - భూమితో కలవడంవల్ల        ( అపాన ) వాయువులు పుడుతున్నాయి.

3 ( అగ్ని పంచీకరణములు )
అగ్ని - ఆకాశంతో కలవడంవల్ల     ( శ్రోత్రం )
అగ్ని - వాయువుతో కలవడంవల్ల   ( వాక్కు )
అగ్ని - అగ్నిలో కలవడంతో           ( చక్షువు )
అగ్ని - జలంతో కలవడంతో         ( జిహ్వ )
అగ్ని - భూమితో కలవడంతో     ( ఘ్రాణం )  పుట్టెను.

4 ( జలం పంచికరణంలు )
జలం - ఆకాశంలో కలవడంవల్ల     ( శబ్దం )
జలం - వాయువుతో కలవడంవల్ల  ( స్పర్ష )
జలం -  అగ్నిలో కలవడంవల్ల        ( రూపం )
జలం - జలంలో కలవడంవల్ల         ( రసం )
జలం - భూమితో కలవడం వల్ల      ( గంధం )పుట్టెను.

5 ( భూమి పంచికరణంలు )
భూమి - ఆకాశంలో కలవడంవల్ల      ( వాక్కు )
భూమి - వాయువుతో కలవడం వల్ల  ( పాని )
భూమి -  అగ్నితో కలవడంవల్ల          ( పాదం )
భూమి - జలంతో కలవడంతో          ( గూహ్యం )
భూమి - భూమిలో కలవడంవల్ల      ( గుదం )  పుట్టెను.

( మానవ దేహ తత్వం )  5  ఙ్ఞానేంద్రియంలు
1  శబ్ద
2  స్పర్ష
3  రూప
4  రస
5  గంధంలు.

5  (  పంచ తన్మాత్రలు )
1  చెవులు
2  చర్మం
3  కండ్లు
4  నాలుక
5  ముక్కు

5  ( పంచ ప్రాణంలు )
1  అపాన 
2  సామనా
3  ప్రాణ
4  ఉదాన
5  వ్యాన

5  (  అంతఃర ఇంద్రియంలు  )  5  (  కర్మేంద్రియంలు )
1  మనస్సు
3  బుద్ది
3  చిత్తం
4  జ్ఞానం
5  ఆహంకారం

1  వాక్కు
2  పాని
3  పాదం
4  గుహ్యం
5  గుదం

6  (  అరిషడ్వర్గంలు  )
1  కామం
3  క్రోదం
3  మోహం
4  లోభం
5  మదం
6  మాత్సర్యం

3  (  శరీరంలు  )
1  స్థూల  శరీరం
2  సూక్ష్మ  శరీరం
3  కారణ  శరీరం

3  (  అవస్తలు  )
1  జాగ్రదావస్త
2  స్వప్నావస్త
3  సుషుప్తి అవస్త

6  (  షడ్బావ వికారంలు  )
1  ఉండుట
2  పుట్టుట
3  పెరుగుట
4  పరినమించుట
5  క్షిణించుట
6  నశించుట

6  (  షడ్ముర్ములు  )
1  ఆకలి
2  దప్పిక
3  శోకం
4  మోహం
5  జర
6  మరణం

.7  (  కోశములు  )  (  సప్త ధాతువులు  )
1  చర్మం
2  రక్తం
3  మాంసం
4  మేదస్సు
5  మజ్జ
6  ఎముకలు
7  శుక్లం

3  (  జీవి త్రయంలు  )
1  విశ్వుడు
2  తైజుడు
3  ప్రఙ్ఞుడు

3  (  కర్మత్రయంలు  )
1  ప్రారబ్దం కర్మలు
2  అగామి  కర్మలు
3  సంచిత  కర్మలు

5  (  కర్మలు  )
1  వచన
2  ఆదాన
3  గమన
4  విస్తర
5  ఆనంద

3  (  గుణంలు  )
1  సత్వ గుణం
2  రజో గుణం
3  తమో గుణం

9  (  చతుష్ఠయములు  )
1  సంకల్ప
2  అధ్యాసాయం
3  ఆభిమానం
4  అవధరణ
5  ముదిత
6  కరుణ
7  మైత్రి
8  ఉపేక్ష
9  తితిక్ష

10  (  5 పంచభూతంలు పంచికరణ   చేయనివి )
      (  5 పంచభూతంలు  పంచికరణం  చేసినవి  )
1  ఆకాశం
2  వాయువు
3  ఆగ్ని
4  జలం
5  భూమి

14  మంది  (  అవస్థ దేవతలు  )
1  దిక్కు
2  వాయువు
3  సూర్యుడు
4  వరుణుడు
5  అశ్వీని దేవతలు
6  ఆగ్ని
7  ఇంద్రుడు
8  ఉపేంద్రుడు
9  మృత్యువు
10  చంద్రుడు
11  చతర్వకుడు
12  రుద్రుడు
13  క్షేత్రజ్ఞుడు
14  ఈశానుడు

10  (  నాడులు  ) 1 (  బ్రహ్మనాడీ  )
1  ఇడా నాడి
2  పింగళ
3  సుషుమ్నా
4  గాందారి
5  పమశ్వని
6  పూష
7  అలంబన
8  హస్తి
9  శంఖిని
10  కూహు
11  బ్రహ్మనాడీ

10  (  వాయువులు  )
1  అపాన
2  సమాన
3  ప్రాణ
4  ఉదాన
5  వ్యాన
6  కూర్మ
7  కృకర
8  నాగ
9  దేవదత్త
10  ధనంజమ

7  ( షట్ చక్రంలు  )
1  మూలాధార
2  స్వాదిస్థాన
3  మణిపూరక
4  అనాహత
5  విశుద్ది
6  ఆఙ్ఞా
7  సహస్రారం

(  మనిషి  ప్రమాణంలు  )
96  అంగుళంలు
8  జానల పోడవు
4  జానల వలయం
33 కోట్ల రోమంలు
66 ఎముకలు
72 వేల నాడులు
62  కీల్లు
37  ముారల ప్రేగులు
1  సేరు గుండే
అర్ద సేరు రుధిరం
4  సేర్లు మాంసం
1  సేరెడు పైత్యం
అర్దసేరు శ్లేషం

(  మానవ దేహంలో 14 లోకాలు  )  పైలోకాలు 7
1  భూలోకం  -  పాదాల్లో
2  భూవర్లలోకం  -  హృదయంలో
3  సువర్లలోకం  -  నాభీలో
4  మహర్లలోకం  -  మర్మాంగంలో
5  జనలోకం  -  కంఠంలో
6  తపోలోకం  -  భృమద్యంలో
7  సత్యలోకం  -  లాలాటంలో

అధోలోకాలు  7
1  ఆతలం  -  అరికాల్లలో
2  వితలం  -  గోర్లలో
3  సుతలం  -  మడమల్లో
4  తలాతలం  -  పిక్కల్లో
5  రసాతలం  -  మొకాల్లలో
6  మహతలం  -  తోడల్లో
7  పాతాళం  -  పాయువుల్లో

(  మానవ దేహంలో  సప్త సముద్రంలు  )
1  లవణ సముద్రం  -  మూత్రం
2  ఇక్షి సముద్రం  -  చెమట
3  సూర సముద్రం  -  ఇంద్రియం
4  సర్పి సముద్రం  -  దోషితం
5  దది సముద్రం  -  శ్లేషం
6  క్షీర సముద్రం  -  జోల్లు
7  శుద్దోక సముద్రం  -  కన్నీరు

(  పంచాగ్నులు  )
1  కాలాగ్ని  -  పాదాల్లో
2  క్షుదాగ్ని  -  నాభిలో
3  శీతాగ్ని  -  హృదయంలో
4  కోపాగ్ని  -  నేత్రంలో
5  ఙ్ఞానాగ్ని  -  ఆత్మలో

7  (  మానవ దేహంలో  సప్త  దీపంలు  )
1  జంబుా ద్వీపం  -  తలలోన
2  ప్లక్ష ద్వీపం  -  అస్తిలోన
3  శాక ద్వీపం  -  శిరస్సుపైన
4  శాల్మల ధ్వీపం  -  చర్మంన
5  పూష్కార ద్వీపం  -  గోలమందు
6  కూశ ద్వీపం  -  మాంసంలో
7  కౌంచ ద్వీపం  -  వెంట్రుకల్లో

10  (  నాధంలు  )
1  లాలాది ఘోష  -  నాధం
2  భేరి  -  నాధం
3  చణీ  -  నాధం
4  మృదంగ  -  నాధం
5  ఘాంట  -  నాధం
6  కీలకిణీ  -  నాధం
7  కళ  -  నాధం
8  వేణు  -  నాధం
9  బ్రమణ  -  నాధం
10  ప్రణవ  -  నాధం
(సేకరణ)

20, జనవరి 2021, బుధవారం

వారణాసి (కాశీి) గురించి తెలియని కొన్ని విషయాలు

🌷కాశీ వైభవాన్ని పూర్తిగా తెలపడం దేవతలకు కూడా సాధ్యం కాదు. సముద్రం నుండి నీటి బిందువు లాంటి సంక్షిప్త సమాచారం🌷

1.  కాశీ పట్టణం గొడుగు లాంటి పంచ క్రోశాల పరిధి లో ఏర్పడ్డ భూభాగం. ఇది లింగం లాంటి పరమేశ్వర స్వరూపం కలిగి ధనుస్సాకారం లో ఉంటుంది. కాశీ బ్రహ్మ దేవుని సృష్టి లోనిది కాదు.

2.  విష్ణు మూర్తి హృదయం నుండి వెలువడి, సృష్టి ఆరంభంలో శివుడు నిర్మించుకున్న ప్రత్యేక స్థలం.

3. ప్రపంచానికి ఆధ్యాత్మిక రాజధాని. ప్రపంచ సాంస్కృతిక నగరం.

4. స్వయంగా శివుడు నివాసముండె నగరం.

5. ప్రళయ కాలంలో మునుగని అతి ప్రాచీన పట్టణం. శివుడు ప్రళయ కాలంలో తన త్రిశూలంతో కాశీని పైకెత్తి కాపాడతాడు.

6. కాశీ భువి పైన సప్త మోక్ష ద్వారాలలో ఒకటి, కాశీ పన్నెందు జోతిర్లింగాలలో కెల్లా శ్రేష్ఠమైనది.

7. పద్నాలుగు భువన భాండాలలో విశేషమైన స్థలం.

8. కాశీలో గంగా స్నానం,బిందు మాధవ దర్శనం, అనంతరం మొదట డిండి వినాయకుడు, విశ్వనాథుడు,విశాలాక్షి, కాలభైరవ దర్శనము అతి ముఖ్యం....

9. ఎన్నో జన్మల పుణ్యం ఉంటే తప్ప క్షేత్ర పాలకుడు బైరవుడు జీవిని కాశీ లోనికి అనుమతించడు.

10. కాశీలో మరణించిన వారికీ యమ బాధ పునర్ జన్మ ఉండదు.

11. కాశీ ప్రవేశించిన జీవి యొక్క చిట్టా చిత్రాగుప్తుని నుండి మాయం అయి కాలభైరవుని వద్దకు చేరుతుంది....

12. డూండీ గణపతి, కాల భైరవుడు పరిశీలించి యమ యాతన కంటే 32 రేట్లు అధిక శిక్షలు విధించి మరు జన్మ లేకుండా చేస్తాడు ...

13. కాబట్టే కాశీలో కాల భైరవ దర్శనం తరవాత పూజారులు వీపు పై కర్రతో కొట్టి దర్శించిన వారు కాశీ దాటి వెళ్లి పోయినా పాపాలు అంటకుండా రక్ష నల్లని కాశి దారం కడతారు.

14. కాశీ వాసం చేసే వారికి సమస్త యాగాలు, తపస్సులు చేసిన పుణ్యం తో పాటు అన్ని చక్రాలు ఉత్తేజితమైతాయి.

15. కాశీలో మరణించిన ప్రతి జీవికి శివుడు దర్శనమిచ్చి వారి కుడి చెవిలో తారక మంత్రం పలికి మోక్షం ప్రసాదిస్తాడు.

16. అందుకే కాశ్యాన్తు మరణాన్ ముక్తి అని శాస్త్ర వచనం కాబట్టే చివరి జీవితం చాలా మంది కాశీలో గడుపుతారు.

17. మరణించిన వారి ఆస్తికలు కాశి గంగలో కలిపితే గతించిన వారు మళ్ళీ కాశీలో జన్మించి స్వయంగా విశ్వనాథునిచే ఉద్దరింప బడతారు.

18. గోముఖం నుండి బయలుదేరే గంగమ్మ విచిత్రంగా దారి మళ్లి దక్షిణ దిశగా ప్రవహించి దన్నుసాకారపు కాశీి పట్టణాన్ని చుట్టి తిరిగి తన దారిలో ప్రవహిస్తుంది

19. ఎంత కరువు వచ్చినా గంగమ్మ కాశీ ఘాట్లను వదిలి దూరం జరగలేదు.

🌺🌹 శివుని కాశీలోని కొన్ని వింతలు🌹🌺

1. కాశీలో గ్రద్దలు ఎగరవు, గోవులు పొడవవు, బల్లులు అరవవు, శవాలు వాసన పట్టవు, కాశీలో మరణించిన ప్రతి జీవి కుడి చెవి పైకి లేచి ఉంటుంది.

2. కాశీలో మందిరం చుట్టూ అనేక చిన్న తోవ సందులు కలిగి అట్టి సందులు అనేక వలయాకారాల్లో చుట్టినట్టు ఉండి ఒక పద్మవ్యూహం లాగా కొత్త వారికీ జాడ దొరకకుండా ఉంటుంది.

3. కానీ పూర్వం ఇక్కడ అనేక సుందర వనాలు, పూలచెట్ల మధ్య ఉన్న మందిరాన్ని విదేశీ దండ యాత్రికుల దాడుల నుండి కాపాడుకోవడానికి ప్రజలంతా గుడి చుట్టూ పెద్ద పెద్ద బంగళాలు కట్టి శత్రు సైనికులకు దారి లేకుండా చేసినారు.

4. అనేక దేశాల నుండి పెద్ద పెద్ద శాస్త్ర వేత్తలు వచ్చి కాశీి లో అనేక రీసెర్చ్ లు జరిపి ఆశ్చర్య పోయ్యారు.

5. అస్సలు ఈ కాస్మోర్స్ ఎక్కడి నిండి వస్తున్నాయి?

6. అప్పటి పూర్వికులు శక్తి చలనం వున్న చోటల్లా మందిరాలు నిర్మించారు

7. అంత పరిజ్ఞానం ఆ రోజుల్లో వారికీ ఎక్కడిది అని ఆశ్చర్యానికి గురైనారు.

8. కాశీి విశ్వేశ్వరునికి శవ భస్మ లేపనం తో పూజ ప్రారంభిస్తారు .

9. కాశీలోని పరాన్న భుక్తేశ్వరుణ్ణి దర్శిస్తే జీవికి పరుల అన్నం తిన్న ఋణం నుండి ముక్తి లభిస్తుంది.

10. కాశీ క్షేత్రంలో పుణ్యం చేస్తే కోటి రెట్ల ఫలితం ఉంటుంది; పాపం చేసినా కోటి రెట్ల పాపం అంటుతుంది.

11. విశ్వనాథుణ్ణి అభిషేకించిన తరవాత చేతి రేఖలు మారిపోతాయి.

12. ఇక్కడి శక్తి పీఠం విశాలాక్షి అమ్మవారు జగత్ అంతటికీ అన్నం పెట్టే అన్నపూర్ణ దేవి నివాస స్థలం కాశి.

13.  ప్రపంచంలోని అన్ని భాషలకు తల్లి అయిన అతి ప్రాచీన సంస్కృత పీఠం కాశీిలోనే వున్నది.

14. కాశీలో గంగమ్మ తీరాన 84 ఘాట్లు వున్నాయి. ఇందులో దేవతలు, ఋషులు, రాజుల తో పాటు ఎందరో తమ తపశ్శక్తితో నిర్మించినవి ఎన్నో వున్నాయి. అందులో కొన్ని :

1) దశాశ్వమేధ ఘాట్:
బ్రహ్మ దేవుడు 10 సార్లు అశ్వమేధ యాగం చేసినది ఇక్కడే. రోజూ సాయకాలం విశేషమైన గంగా హారతి జరుగుతున్నది.

2) ప్రయాగ్ ఘాట్:
ఇక్కడ భూగర్భంలో గంగతో యమునా,సరస్వతిలు కలుస్తాయి.

3) సోమేశ్వర్ ఘాట్:
చంద్రుని చేత నిర్మితమైనది.

4) మీర్ ఘాట్:
సతీదేవీ కన్ను పడిన స్థలం. విశాలాక్షి దేవి శక్తి పీఠం.
ఇక్కడే యముడు ప్రతిష్టించిన లింగం ఉంటుంది.

5) నేపాలీ ఘాట్:
పశుపతి నాథ్ మందిరం బంగారు కలశంతో నేపాల్ రాజు కట్టినాడు.

6) మణి కర్ణికా ఘాట్:
ఇది కాశీలో మొట్ట మొదటిది. దీనిని విష్ణు దేవుడు స్వయంగా సుదర్శన చక్రంతో తవ్వి నిర్మించాడు. ఇక్కడ సకల దేవతలు స్నానం చేస్తారు ఇక్కడ గంగ నిర్మలంగా పారుతుంది. ఇక్కడ మధ్యాహ్నం సమయంలో ఎవరైనా సుచేల స్నానం చేస్తే వారికి జన్మ జన్మల పాపాలు తొలిగి పోతాయి. జీవికి ఎంత పుణ్యం ప్రాప్తిస్తుందో చతుర్ ముఖ బ్రహ్మ దేవుడు కూడా వర్ణించలేడట.

7) విష్వేవర్ ఘాట్:
ఇప్పుడు సింధియా ఘాట్ అంటారు. ఇక్కడే అహల్యా బాయి తప్పసు చేసింది. ఇక్కడ స్నానం చేసే బిందు మాధవుణ్ణి దర్శిస్తారు.

8) పంచ గంగా ఘాట్:
ఇక్కడే భూగర్భం నుండి గంగలో 5 నదులు కలుస్తాయి.

9) గాయ్ ఘాట్:
గోపూజ జరుగుతున్నది.

10) తులసి ఘాట్:
తులసి దాస్ సాధన చేసి రామాచరిత మానస్ లిఖించమని శివుని ఆదేశం పొందినది.

11) హనుమాన్ ఘాట్:
ఇక్కడ జరిగే రామ కథ వినడానికి హనుమంతుడు వస్తుంటాడు. ఇక్కడే సూర్యుడు తపస్సు చేసి అనేక శక్తులు పొందిన లోలార్క్ కుండం వున్నది
ఇక్కడే శ్రీ వల్లభాచార్యులు జన్మించారు.

12) అస్సి ఘాట్:
పూర్వం దుర్గా దేవి శుంభ, నిశుంభ అను రాక్షసులను చంపి అట్టి ఖడ్గంను వెయ్యడం వల్ల ఇక్కడ ఒక తీర్థం ఉద్బవించింది.

13) హరిశ్చంద్ర ఘాట్:
సర్వం పోగొట్టుకొని హరిశ్చంద్రుడు ఇక్కడ శవ దహన కూలీగా పని చేసి దైవ పరీక్షలో నెగ్గి తన రాజ్యాన్ని పొందినాడు. నేటికి ఇక్కడ నిత్యం చితి కాలుతూ ఉంటుంది...

14) మానస సరోవర్ ఘాట్:
ఇక్కడ కైలాసపర్వతం నుండి భూగర్భ జలధార కలుస్తున్నది.
ఇక్కడ స్నానం చేస్తే కైలాస పర్వతం చుట్టిన పుణ్యం లభిస్తున్నది.

15) నారద ఘాట్:
నారదుడు లింగం స్థాపించాడు.

16)చౌతస్సి ఘాట్:
ఇక్కడే స్కంధపురాణం ప్రకారం ఇక్కడ 64 యోగినిలు తపస్సు చేసినారు.
ఇది దత్తాత్రేయునికి ప్రీతి గల స్థలం... ఇక్కడ స్నానం చేస్తే పాపాలు తొలిగి 64 యోగినుల శక్తులు ప్రాప్తిస్తాయి.

17) రానా మహల్ ఘాట్:
ఇక్కడే పూర్వం బ్రహ్మ దేవుడు సృష్టి కార్యంలో కలిగే విఘ్నాలను తొలగించమని వక్రతుండ వినాయకుణ్ణి తపస్సు చేసి ప్రసన్నుణ్ణి చేసుకున్నాడు.

18)అహిల్యా బాయి ఘాట్

ఈమె కారణంగానే మనం ఈరోజు కాశీ
విశ్వనాథుణ్ణి దర్శిస్తున్నాము.

కాశీలోని గంగా నది ప్రవాహంలో అనేక ఘాట్ల దగ్గర ఉద్భవించే తీర్థాలు కలిసి ఉంటాయి.

పూర్వం కాశీలో దేవతలు ఋషులు రాజులూ నిర్మించిన అనేక మందిరాలు కట్టడాలు వనాల మధ్య విశ్వనాథుని మందిరం ఎంతో వైభవోపేతంగా వెలుగొందింది.

కానీ మహమ్మదీయ దండ యాత్రికులు కాశీని లక్ష్యంగా చేసుకొని దాడులు చేసి ధ్వంసం చేసిన తరవాతి కాశిని మనం చూస్తున్నాము.

విశ్వనాథ, బిందు మాధవ తో పాటు ఎన్నో అనేక మందిరాలను కూల్చి మసీదులు కట్టినారు.

నేటికీ విశ్వనాథ మందిరంలో నంది, మసీదు వైపు గల కూల్చ బడ్డ మందిరం వైపు చూస్తోంది.

అక్కడే శివుడు త్రిశూలం తో త్రవ్విన జ్ఞానవాపి తీర్థం బావి ఉంటుంది.

ఈరోజు మనం దర్శించే విశ్వనాథ మందిర అసలు మందిరానికి పక్కన ఇండోర్ రాణి శ్రీ అహల్యా బాయి హోల్కర్ గారు కట్టించారు

కాశీ స్మరణం మోక్షకారకం!

కాశీ విశ్వనాధాష్టకం

గంగాతరంగ రమణీయ జటా కలాపం,
గౌరీ నిరంతర విభూషిత వామ భాగం;
నారాయణ ప్రియ మదంగ మదాప హారం,
వారాణసి పురఃపతిం భజ విశ్వనాథం.||1||

వాచామ గోచర మనేక గుణ స్వరూపం,
వాగీశ విష్ణు సుర సేవిత పాద పీఠం;
వామేన విగ్రహవరేణ కళత్ర వంతం,
వారాణసి పురఃపతిం భజ విశ్వనాథం.||2||

భూతాదిపం భుజగ భూషణ భూషితాంగం,
వ్యాగ్రాజిలాం భరధరం జటిలం త్రినేత్రం;
పాశాంకుసాభయ వర ప్రద శూల పాణిం,
వారాణసి పురఃపతిం భజ విశ్వనాథం.||3||

సితాంసుశోభిత కిరీట విరాజ మానం,
పాలేక్షణానల విశోసిత పంచ భానం;
నాగాధిపారచిత భాసుర కర్ణ పూరం,
వారాణసి పురఃపతిం భజ విశ్వనాథం.||4||

పంచానలం దురిత మత్త మతంగ జానాం,
నాగాంతకం దనుజ పుంగవ పన్న గానాం;
దావానలం మరణ శోక జరాట వీణా,
వారాణసి పురఃపతిం భజ విశ్వనాథం.||5||

తేజోమయం సగుణ నిర్గుణ మద్వితీయం,
ఆనంద కంద మపిరాజిత మప్రమేయం;
నాగాత్మకం సకల నిష్కలమాత్మ రూపం,
వారాణసి పురఃపతిం భజ విశ్వనాథం.||6||

ఆశాం విహాయ పరిహృత్య పరస్యనింత,
ఉపేరతించ సునివార్య మనఃసమాదౌ;
ఆదాయ హృత్కమల మధ్య గతం ప్రదేశం,
వారాణసి పురఃపతిం భజ విశ్వనాథం.||7||

నాగాధి దోష రహిత స్వజనానురాగం,
వైరాగ్య శాంతి నిలయం గిరిజా సహాయం;
మాధుర్య ధైర్య సుభగం గరళాభిరామం,
వారాణసి పురఃపతిం భజ విశ్వనాథం.||8||

వారాణసీ పురపతేః స్థవనం శివస్య,
వ్యాసోత్త మిష్ఠక మిదం పఠితా మనుష్య;
విద్యాం శ్రియం విపుల సౌక్య మనంత కీర్తిం,
సంప్రాప్య దేహ నిలయే లభతేచ మోక్షం.||9||

విశ్వనాధాష్టక మిదం యః పఠేచిత శివ సన్నిదౌ,
శివలోక మవాప్నోతి శివేన సహమోదతే.
ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ... జన్మ జన్మలకు నీతోనే ఉండే భాగ్యం ప్రసాదించు స్వామీ... హర హర మహాదేవ

28, డిసెంబర్ 2020, సోమవారం

లంబసింగి అందాలు

లంబసింగి: 250 మంది ఉండే ఈ ఊరికి ఈ నాలుగు నెలల్లో లక్షల మంది వచ్చివెళ్తారు

లంబసింగి

అక్కడ సూర్యుడు చంద్రుడిలా చూడముచ్చటగా కనిపిస్తాడు. మంచుతో జత కలిసిన సూర్యకిరణాలు గిలిగింతలు పెడుతుంటాయి.

మండు వేసవిలో కూడా అక్కడి ఉష్ణోగ్రత 20 డిగ్రీలు దాటదు. 250 మంది జనాభా ఉన్న ఆ గ్రామానికి శీతాకాలంలో లక్షల మంది పర్యాటకులు వస్తారు.

సముద్రమట్టానికి 3,600 అడుగుల ఎత్తులో ఉన్న ఒక కొండ గ్రామం అది. దీన్నే అంతా లంబసింగి అని పిలుస్తుంటే... ఆ గ్రామస్థులు మాత్రం కొర్రబయలు అంటారు.

శీతాకాలం వచ్చిందంటే చాలు వర్షంలా కురుస్తున్న మంచుతో లంబసింగి మంచు మందారంలా మెరిసిపోతుంది. దక్షిణాది కశ్మీర్‌గా పేరు పొందిన ఈ ప్రదేశంలో డిసెంబరు నుంచి జనవరి చివరి వరకూ అతి చల్లటి వాతావరణం కనిపిస్తుంది.

ఈ కాలంలో సున్నా డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రత నమోదవుతుంది. ఉదయం పదిగంటలైనా సూర్యుడు కనిపించని ఈ ప్రాంతానికి రెండుమూడు కిలోమీటర్ల దూరంలో మాత్రం సాధారణ వాతావరణమే ఉండటం విశేషం

లంబసింగి

'ఓసారి దొంగ కొయ్యబారిపోయాడు'

ఈ ప్రాంతాన్ని స్థానికులు కొర్రబయలు అని పిలుస్తారు. కొర్ర అంటే కర్ర, బయలు అంటే బయట అని అర్థం. ఎవరైనా పొరపాటున ఇంటి బయట పడుకున్నారంటే తెల్లారేసరికి కొయ్యలా బిగుసుకుపోతారనే అర్థంలో అలా పిలుస్తారు. అంతటి చలి ఇక్కడ ఉంటుంది.

ఈ చలి తీవ్రతకి ఓసారి ఓ దొంగ ప్రాణాలు పోయేంత పరిస్థితి వచ్చిందని స్థానిక ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు నాగేశ్వరరావు బీబీసీతో చెప్పారు.

"ఇక్కడ ఎప్పట్నుంచో తీవ్రమైన చలి ఉంది. అయితే ఏజెన్సీలోని మారుమూల ప్రాంతం కాబట్టి లంబసింగి కోసం పెద్దగా ఎవరికి తెలిసేది కాదు. నా చిన్నతనంలో జరిగిన సంఘటన చెబుతాను. ఊర్లోకి వచ్చిన ఒక దొంగని మా గ్రామస్థులు పట్టుకున్నారు. ఇప్పుడున్న హనుమంతుడి గుడి వద్ద అప్పట్లో ఒక పెద్ద కొయ్య పాతేసి ఉండేది. అతడిని ఆ కొయ్యకి కట్టి... రాత్రంతా అక్కడే ఉంచారు. ఉదయం చూసేసరికి అతడు కొయ్యబారిపోయాడు. అప్పుడు అతడికి స్థానిక మంత్రసానులు వైద్యం చేసి కాపాడారు. అతడు కోలుకోడానికి మూడు రోజులు పట్టింది. ఇక్కడ ఆ స్థాయిలో చలి ఉంటుంది. ఒకప్పుడు మా గ్రామంలో పది మంది కూడా బయట కనిపించేవారు కాదు. ఇప్పుడు వందలాది మంది మా గ్రామానికి వస్తున్నారు. అసలు ఇది మా ఊరేనా అనిపిస్తుంటుంది" అని ఆశ్చర్యపోతూ చెప్పారు.

లంబసింగి

నిత్యం భోగి పండగే

కశ్మీరం దారి తప్పి వచ్చిందా అన్నట్లు ఉంటుంది లంబసింగి. అందరికి భోగి పండగ ఏడాదికి ఒకసారి వస్తే... ఇక్కడి వారికి మాత్రం నిత్యం భోగి పండగే. నిత్యం చలి మంటలు కనిపిస్తాయి. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ... అలాగే సాయంత్రం 4 గంటల నుంచి మళ్లీ ఉదయం వరకూ ఎక్కడ చూసినా చలిమంటలే ఉంటాయి.

"ఇప్పుడు చలీ, మంచూ... అంటూ ఎక్కడెక్కడ నుంచో చాలా మంది మా గ్రామానికి వస్తున్నారు. కానీ మేం పుట్టి పెరిగింది ఈ చలిలోనే, మా జీవితం గడిచేది ఈ మంచులోనే. అయితే ఏడాదిలో మూడు నెలల పాటు పర్యాటకులు రావడంతో మాకు పండగలా ఉంటుంది. టీవీ, పేపర్లలో మా గ్రామాన్ని చూపించడం మాకు భలే సరదాగా ఉంటుంది. మాకు టీ, టిఫిన్ వ్యాపారం బాగా జరుగుతుంది. కాకపోతే సీజన్ అయిపోగానే మళ్లీ మా గ్రామాలు బోసిపోతాయి. అప్పుడు ఏదో వెలితిగా అనిపిస్తుంది" అని స్థానిక టీ దుకాణం యాజమని సోమశేఖర్ చెప్పారు

లంబసింగి

'ఉండేది 250 మంది... వచ్చేది లక్షల మంది'

దట్టంగా కమ్ముకున్న పొగమంచు ఓవైపు... మంచు తుంపరుల పలకరింపు మరోవైపు... గాలిని సైతం గడ్డకట్టించే చల్లగాలి ఇంకోవైపు... ఇవి లంబసింగిలో నిత్యం కనిపించే దృశ్యాలు.

మైదాన ప్రాంతాలకు సుదూరంగా ఉండే లంబసింగి లాంటి గిరిజన గ్రామాలకు సాధారణంగా ఎవరూ రారు. అక్కడ అడుగడుగునా చెట్లు, పుట్టలే కానీ మనుషులు పెద్దగా కనిపించరు. కానీ ఇప్పుడు పరిస్థితి వేరు.

లంబసింగిలో ఉన్నవి కేవలం 60 కుటుంబాలు మాత్రమే. మొత్తం జనాభా 250. అయితే శీతాకాలం వచ్చిందంటే చాలు ఎక్కడెక్కడి నుంచో వచ్చి వాలే పర్యాటకులతో ఊరు సందడి సందడిగా మారిపోతుంది.

"లంబసింగికి సీజన్‌లో సరాసరి రోజూ 10 నుంచి 12 వేల మంది పర్యాటకులు వస్తుంటారు. నాలుగు నెలల పాటు సీజన్ కొనసాగుతుంది. లంబసింగి ఏజెన్సీ టూరిజానికి హాట్ స్పాట్‌గా మారింది. ఏడేళ్ల క్రితం ఒక్కసారిగా ఉష్ణోగ్రత సున్నా డిగ్రీలకు పడిపోవడంతో అప్పట్నుంచి ఈ ప్రాంతం ఎంతో ప్రాధాన్యం సంతరించుకుంది. ఇక్కడి ఉష్ణోగ్రతల కారణంగానే లంబసింగికి ఆంధ్రా కశ్మీర్, ఆంధ్రా ఊటీ, దక్షిణాది కశ్మీర్ అనే పేర్లొచ్చాయి. టూరిజం శాఖ కూడా ఈ ప్రాంతాన్ని ప్రొమోట్ చేయడానికి అనేక ఏర్పాట్లు చేయడంతో పర్యాటకుల తాకిడి విపరీతంగా పెరిగింది" అని లంబసింగి టూరిజం యూనిట్ మేనేజర్ నాయుడు బీబీసీతో చెప్పారు.

లంబసింగి

కొండగ్రామంలో హనీమూన్

విశాఖపట్నం నుంచి లంబసింగికి 130 కిలోమీటర్ల దూరం. అందులో 30 కిలోమీటర్లు ఘాట్ రోడ్ ప్రయాణమే. వంపులు తిరిగిన కొండల్లో సాగే ఈ ప్రయాణం నిజంగా ఒక మధురానుభూతే.

లంబసింగి వరకు మాములుగా ఉండే చలి... చెక్ పోస్ట్ దాటేసరికి ఒక్కసారిగా మంచు ప్రపంచంలోకి మనల్ని లాగేసుకుంటుంది. ఈ చలిని తట్టుకునేందుకు ఛాయ్ మీద ఛాయ్ కొట్టాల్సిందే. లేదా చలిమంటల వద్దకు పరుగులు పెట్టాల్సిందే.

"మాది విజయవాడ. లంబసింగి గురించి 5 ఏళ్ల క్రితం తెలిసింది. అప్పటి నుంచి ఇక్కడికి రావాలని అనుకుంటూనే ఉన్నాను. కానీ కుదరలేదు. ఇప్పుడు నాకు పెళ్లైంది. హానీమూన్‌కి ఎక్కడికో వెళ్లడం ఎందుకు లంబసింగైతే బాగుంటుందని ఇక్కడికే వచ్చాం. లంబసింగి వాతావరణం అద్భుతంగా ఉంది. ఇక్కడి ప్రకృతి అందాల్నీ... పై నుంచి పడుతున్న మంచు కిరణాల్నీ... ఎప్పటీకి మరచిపోలేను" అని నిఖిత బీబీసీతో చెప్పారు.

లంబసింగి

3 గంటల కోసం... 2 రోజుల పర్యటన

ఇక్కడి మంచు అందాలనూ... ఎప్పుడూ అనుభవించనంత చలినీ... ఎంజాయ్ చేయాలంటే రెండు రోజుల లంబసింగి పర్యటనకు ప్రణాళిక చేసుకోవాలి. ముందురోజు రాత్రి దగ్గరిలో ఉన్న మైదాన ప్రాంతానికి చేరుకున్న టూరిస్టులు... లంబసింగిలో మంచుతో జతకలిసిన సూర్యోదయాన్ని చూడటం కోసం వేకువజామునే పయనమవుతారు. లంబసింగి చేరుకొనేటప్పుడు చల్లని వాతావరణం, మంచుతెరలు...చక్కటి అనుభూతిని కలిగిస్తాయి.

లంబసింగిలో తెల్లవారుజామున నాలుగు గంటలకు మొదలైన చలి ఉదయం ఏడు గంటల వరకు తన ప్రతాపాన్ని చూపిస్తుంది. ఆ తర్వాత క్రమంగా తగ్గుతుంది.

కుటుంబాలు, కొత్త జంటలు, ప్రేమికులు ఇలా ఎక్కడెక్కడి నుంచో 'ఛలో లంబసింగి' అంటూ వస్తుంటారు. శీతకాలం వారాంతాల్లో విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్‌ నుంచే కాకుండా బెంగళూరు, భువనేశ్వర్ నుంచి కూడా వాహనాల్లో లంబసింగికి పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తున్నారు.

దీంతో ఈ గిరిజన గ్రామంలో గంటలకొద్దీ ట్రాఫిక్ జామ్ అయి...నగర వాతావరణాన్ని తలపిస్తుంది. ఉదయం ఆరు గంటలకు కొద్దిగా వెలుతురు రావడంతో పర్యాటకులు తమ కెమెరాలకు పనిచెబుతారు. ప్రకృతి అందాల నేపథ్యంతో సెల్ఫీలు, గ్రూప్‌ ఫొటోలు తీసుకుంటూ సందడి చేస్తారు. యువతీయువకులు చలిమంటల చుట్టూ తిరుగుతూ ఆటపాటలతో సందడి చేస్తుంటారు.

లంబసింగి

మంచు 'పాలసముద్రం'

లంబసింగికి మూడు కిలోమీటర్ల దూరంలో 'చెరువులవేనం' అనే గ్రామం ఉంది. ఆ గ్రామం కొండపైకి ఎక్కితే అక్కడో అద్భుతం ఆవిష్కృతమవుతుంది. సినిమాల్లోనో, ఫోటోల్లోనో గ్రాఫిక్ మాయజాలంలో చూసే పాలసముద్రం అక్కడ మన కళ్లేదుట ప్రత్యక్షమతుంది.

మంచు మేఘాలను తాకుతున్నట్లుగా కనిపించే 'చెరువులవేనం' పర్యాటకులను మరింతగా ఆకర్షిస్తోంది. ఉదయం నాలుగైదు గంటలకే లంబసింగి చేరుకున్న పర్యాటకులు 'చెరువులవేనం' వెళ్లేందుకు క్యూ కడతారు. కనుచూపుమేరలో కమ్ముకుని ఉన్న మంచు మేఘాలను ఆస్వాదిస్తారు.

ఇక లంబసింగికి ఆరు కిలోమీటర్ల దూరంలో తాజంగి రిజర్వాయర్ ఉంది. ఇది కూడా పర్యాటక కేంద్రమే. ఈ రిజర్వాయర్‌ను చూసేందుకు లంబసింగికి వచ్చిన అందరూ ఇక్కడకీ వస్తారు.

ఈ రిజర్వాయర్‌పై 'జిప్ వే' ఏర్పాటు చేసింది పర్యాటక శాఖ. రిజర్వాయర్ ఒక చివర నుంచి మరో చివరకు గాల్లో తేలుతూ...సెల్ఫీలు తీసుకుంటూ 'జిప్ రోప్' ద్వారా చేరుకుంటారు పర్యాటకులు. ఇది ప్రధాన ఆకర్షణగా మారింది. అలాగే ఇక్కడికి వచ్చే పర్యాటకులను అలరించేందుకు థింసా నృత్య ప్రదర్శనలు కూడా ఏర్పాటు చేశారు.

లంబసింగి

పెరిగిన పర్యాటకం... తగ్గిన వలసలు

లంబసింగితో పాటు చుట్టు పక్కల ఉన్న గిరిజన గ్రామాల్లోని యువత ఉపాధి కోసం మైదాన ప్రాంతాలకు వలస పోతుండేవారు. అయితే గత కొంతకాలంగా లంబసింగి విపరీతంగా ఫేమస్ కావడంతో ఈ ప్రాంతానికి పర్యాటకుల సంఖ్య అనుహ్యాంగా పెరిగింది.

పర్యాటకులు పెద్ద ఎత్తున వస్తుండటంతో లంబసింగి అంతటా పెద్ద ఎత్తున వ్యాపారాలు విస్తరించాయి. టూరిస్టులు పెరగడంతో స్థానిక యువకులు చిన్నచిన్న వ్యాపారాలు పెట్టుకుని ఇక్కడే ఉపాధి పొందుతున్నారు.

ఇక్కడ 'నైట్ స్టే' చేసేందుకు రిసార్ట్స్, హోటల్స్, గుడారాలను అందుబాటులోకి తెచ్చారు కొందరు స్థానికులు. అలాగే టూరిజంశాఖకి కూడా ఆదాయం గణనీయంగా పెరిగింది.

"టిఫిన్, టీ దుకాణాలతో పాటు రాత్రి స్టే చేసేందుకు టూరిస్టులకు గుడారాలు అద్దెకివ్వడం, టూరిస్టుల కోరిక మేరకు వారు భోజన సౌకర్యాలు చూడటం వంటివి చేస్తూ ఉపాధి పొందుతున్నాం. ఎక్కడో దూరంగా వెళ్లి ఉపాధి పొందేకంటే ఇక్కడే సీజన్‌లో వ్యాపారం చేసుకుని...అన్ సీజన్‌లో వ్యవసాయం చేసుకుంటున్నాం. స్థానికంగా ప్రభుత్వ, ప్రైవేటు రిసార్ట్స్ కూడా రావడంతో... వాటిలో కూడా మాకు పని దొరుకుతుంది" అని గుడారాలను అద్దెకిచ్చే స్థానికుడు రామగోవింద్ చెప్పారు

లంబసింగి

లంబసింగికి ఆ ప్రత్యేకత ఎందుకంటే...

లంబసింగిలో ఇంతటి ఆహ్లాదకరమైన వాతావరణం రావాడానికి ఇక్కడున్న ప్రకృతి సమతుల్యతే కారణం అంటున్నారు ఆంధ్ర విశ్వవిద్యాలయం మెటరాలజీ, ఓషియనోగ్రఫీ విభాగాధిపతి ప్రొఫెసర్ రామకృష్ణ.

"రెండు చిన్న కొండల మధ్యలో ఉండే గ్రామం లంబసింగి. రెండు కొండల మధ్య నుంచి వచ్చే శీతల గాలులు అక్కడ మేఘాలను నిలవనివ్వవు. దాంతో అక్కడ చల్లని వాతావరణం ఏర్పడుతుంది. సముద్ర మట్టానికి ఎత్తుతో ఉండటం కూడా మరో కారణం. ముఖ్యంగా గుంపులుగా ఉండే చెట్ల వల్ల ఇక్కడి గాలిలో తేమ శాతం ఎక్కువగా ఉంటుంది. దీంతో ప్రకృతి సమతుల్యత ఏర్పడుతుంది. ప్రకృతి సమతుల్యత ఉన్న ప్రదేశాల్లో చల్లని, అతి చల్లని వాతావరణం ఉంటుంది. అలాగే సైబీరియన్ వేవ్స్ ప్రభావం కూడా అధికంగా ఉండటంతో అక్కడి నుంచి వస్తున్న గాలుల ప్రభావంతో చలి అధికంగా ఉంటుంది"అని ప్రొఫెసర్ రామకృష్ణ వివరించారు


బిబిసి నుండి సేకరణ...



30, నవంబర్ 2020, సోమవారం

వాణీ జయరాం

ఆమె గానం... సుమధురం

70వ శకం తొలిరోజుల్లో రేడియో సిలోన్‌ వారి బినాకా గీతమాలా కార్యక్రమంలో ‘బోల్‌ రే పపీ హరా.. పపి హరా’ అనే ‘గుడ్డి’ సినిమా పాట 16 వారాలు క్రమం తప్పకుండా వినిపించింది. ఆ పాటను వింటూ సంగీతప్రియులు మైమరచిపోయి రసాస్వాదనలో మునిగిపోయారు. ఆ పాటను ఆలపించింది వాణిజయరాం. అది ‘గుడ్డి’ సినిమాలో ఆమె పాడిన మొదటిపాట. అలా మొదటి పాటతోనే హిందీ చిత్రసీమలో వాణిజయరాం పేరు మారుమోగి పోయింది. సంప్రదాయ కర్నాటక, హిందుస్తానీ సంగీతంలో నిష్ణాతురాలైన వాణిజయరాం పాటలు విలక్షణంగా ఉండేవి. క్రమంగా నౌషాద్, మదన్‌ మోహన్, జయదేవ్, చిత్రగుప్త, ఓ.పి. నయ్యర్, ఆర్‌.డి.బర్మన్, కల్యాణ్‌ జీ ఆనంద్‌ జీ, లక్ష్మీకాంత్‌ ప్యారేలాల్‌ వంటి సంగీత దర్శకులు వాణిజయరాంకి మంచి అవకాశాలు ఇవ్వటం మొదలైంది. చలనచిత్రరంగం ఆమెను ‘భారతీయ నైటింగేల్‌’ అని పిలవసాగింది. అప్పటికే వేళ్లూనుకొని వున్న కొందరికి ఆమె ఎదుగుదల రుచించలేదు. సహజంగానే రాజకీయం నడిపారు. సున్నిత మనస్కురాలైన వాణిజయరాంకి మనస్తాపం కలిగింది. వెంటనే మద్రాసుకి మకాం మార్చింది. అలా తెలుగు సినిమాల్లో ఆమె పాడిన పాటలు వినే భాగ్యానికి శ్రోతలు నోచుకున్నారు. అంతేకాదు, తెలుగు సినిమాలే ఆమెకు రెండు జాతీయ ఉత్తమ గాయని పురస్కారాలు తెచ్చిపెట్టాయి. నవంబరు 30న వాణి జయరాం  పుట్టినరోజు సందర్భంగా ఆమె గురించి కొన్ని విశేషాలు....

సంగీత నేపథ్యం...

తమిళనాడులోని వెల్లూరులో 1945 నవంబర్‌ 30న వాణిజయరాం సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టింది. ఆమె అసలు పేరు కలైవాణి. ఆరుగురు అక్కచెల్లెళ్ల సంతతిలో వాణిజయరాం ఐదవ సంతానం. తల్లి పద్మావతి ప్రముఖ వీణా విద్వాంసులు రంగరామానుజ అయ్యంగార్‌ శిష్యురాలు. కుటుంబ సభ్యులందరికీ సంగీతమంటే ప్రాణం. తన అక్క కడలూర్‌ శ్రీనివాస అయ్యంగార్‌ వద్ద సంగీత శిక్షణ పొందుతూ వుంటే వాణి కూడా ఆమెతోబాటు కీర్తనలు పాడుతుండేది. కుటుంబం మద్రాసుకు మకాం మార్చిన తరువాత కడలూర్‌ శ్రీనివాస అయ్యంగార్, టి.ఆర్‌.బాలసుబ్రమణియన్, ఆర్‌.ఎస్‌.మణిల శిష్యరికంలో కఠినమైన కర్నాటక సంగీతాన్ని ఆపోసన పట్టింది. ముత్తుస్వామి దీక్షితార్‌ కీర్తనలు వాణి బాగా పాడేది. తన ఎనిమిదవ ఏటనే వాణిజయరాం సంగీత కచేరి నిర్వహించింది. చిన్నతనం నుంచీ హిందీ పాటలు రేడియో సిలోన్‌లో వినటం వాణికి అలవాటు. నేపధ్యగాయనిగా ప్రయత్నం చేస్తానంటే తల్లి ఒప్పుకోలేదు. పెళ్లయ్యేదాకా ఆ ప్రయత్నం మానుకోమంది. మద్రాస్‌ క్వీన్స్‌ మేరీ కాలేజిలో పట్టా పుచ్చుకున్న తరువాత స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో తొలుత మద్రాసు, తరువాత హైదరాబాదులో ఉద్యోగం చేసింది. 1960లో జయరాంతో వివాహానంతరం వాణి మకాం బొంబాయికి మారింది. వ్యాపార ప్రకటనలకు ‘జింగిల్స్‌’ పాడుతూ వాణిజయరాం బిజీగా ఉంటూనే ఉస్తాద్‌ అబ్దుల్‌ రెహమాన్‌ ఖాన్‌ వద్ద హిందుస్తానీ సంప్రదాయ సంగీతంలో శిక్షణ పొందింది. ఈ శిక్షణ ఎంత కఠినమైందంటే రోజుకి 18 గంటలు ‘తుమ్రి భజన్‌’లో మెళకువలు ‘గజల్‌’ ప్రక్రియలో సాంకేతికత నేర్చుకొవటానికే సరిపోయేది. ఈ శిక్షణా కాలంలోనే వాణిజయరాం తన మొట్టమొదటి హిందుస్తానీ క్లాసికల్‌ కచేరిని మార్చి 1, 1969న బొంబాయిలో ఏర్పాటుచేసి సభికుల్ని అలరించి విద్వాంసుల్ని ఆకట్టుకుంది. అప్పుడే ప్రముఖ సంగీత దర్శకుడు వసంత దేశాయిని కలవటం తటస్థించింది. వినూత్నమైన ఆమె కంఠస్వరానికి ముగ్దుడైన వసంత దేశాయి వాణిజయరాంతో తొలుత కుమారగంధర్వతో ఒక మరాఠీ యుగళగీతాన్ని పాడించారు. ఆ వెంటనే హృషికేష్‌ ముఖర్జీ దర్శకత్వం వహించిన ‘గుడ్డి’ (1971) సినిమాలో మూడు పాటలు పాడించారు. వసంతదేశాయ్‌ మేఘమల్హర్‌ రాగంలో స్వరపరచిన ‘బోల్‌ రే పపీ హరా, పపి హరా’ను తన తొలి హిందీ పాటగా వాణిజయరాం 22 డిసెంబరు 1970న పాడింది. ఆ పాటకు ఐదు అవార్డులే కాక, ప్రతిష్టాత్మక ‘తాన్సేన్‌ సమ్మాన్‌’ అవార్డు కూడా వచ్చింది. తరువాత వాణి ఎన్నో మరాఠీ పాటలు పాడింది. పండిట్‌ కుమార గంధర్వతో కలిసి యుగళగీతాలు పాడింది. వసంత దేశాయితో మహారాష్ట్ర మొత్తం పర్యటించి గొప్ప మరాఠీ పాటల రుచులను ప్రజలకు చేరువ చేసింది. పాఠశాల విద్యార్ధులకు మరాఠీ సంగీతంలో శిక్షణ ఇచ్చింది. నిద్రలేవగానే ఆమె నమస్కరించేది దేవుడి పటంతోబాటు మొదటి గురువు వసంత దేశాయి ఫోటోకే. అంతేకాదు అతని ఫోటోకి నిత్యం పూజ కూడా చేస్తుంది. ‘గుడ్డి’ విజయంతో వాణిజయరాం ముఖ్య సంగీత దర్శకులకే కాకుండా మరాఠీ, గుజరాతి, మార్వాడి, భోజపురి భాషా చిత్రాలకూ పాటలు పాడింది. రఫీ, మన్నాడే, మహేంద్ర కపూర్, ముఖేష్, కిషోర్‌ కుమార్‌ల సరసన ఎన్నో యుగళ గీతాలకు ప్రాణం పోసింది. నౌషాద్, చిత్రగుప్త, మదన్‌ మోహన్, ఓ.పి.నయ్యర్, ఆర్‌.డి.బర్మన్, కళ్యాన్‌ జి ఆనంద్‌ జి, లక్ష్మీకాంత్‌ ప్యారేలాల్‌ వంటి హేమాహేమీలైన సంగీత దర్శకుల చిత్రాలకు అనేక హిందీ పాటలు ఆలపించింది. తరువాత ఆమె మకాం మద్రాసుకు మార్చింది.

దక్షిణ భారత గాన సరస్వతిగా..

వాణిజయరాం మద్రాసుకు తరలి రావటం దక్షిణ భారత చిత్రసీమకు మేలే జరిగింది. మాతృభాష కాకపోయినా పాడిన అన్ని భాషల్లో మాటల స్వచ్చతతోబాటు నేటివిటీని జోడించి పాడటంచేత ఆమె కంఠాన్ని తమ స్వంత ఆడపడుచు స్వరంగానే అందరూ భావించి ఆదరించారు. మద్రాసు వచ్చిన కొత్తలో వాణిజయరాం చేత ఎస్‌.ఎం.సుబ్బయ్య నాయుడు ‘తాయ్యుం సెయ్యుం’ అనే చిత్రానికి పాడించారు. అనివార్యకారణాల వలన ఆ చిత్రం విడుదలకు నోచుకోలేదు. తరువాత శంకర్‌-గణేష్‌ ‘వీట్టుక్కు వందా మరుమగü్’ (1973) చిత్రంలో సౌందర్‌ రాజన్‌తో కలిసి ‘ఓరిడం వున్నిడం’ అనే యుగళ గీతాన్ని పాడించటంతో తమిళంలో వాణిజయరాం బిజీ అయ్యారు. తరువాత శంకర్‌-గణేష్‌ సంగీత దర్శకత్వంలో చాలా సినిమాలకు పాటలు పాడారు. ఎం.ఎస్‌.విశ్వనాథన్‌-బాలచందర్‌ జంట కలిసి పనిచేసిన అనేక తమిళ సినిమాలకు వాణిజయరాం అద్భుతమైన పాటలు పాడారు. వారి సంగీతసాంగత్యం చాలాకాలం కొనసాగింది. ‘అపూర్వ రాగంగళ్‌’ సినిమాతో వాణిజయరాం చాలా బిజీ అయ్యారు. కున్నక్కుడి వైద్యనాదన్, వి.కుమార్, జి.కె. వెంకటేష్, విజ్కాయ భాస్కర్, కె.వి.మహదేవన్‌ సంగీత సారధ్యంలో వాణిజయరాం ఎన్నో తమిళ, కన్నడ పాటలు పాడారు. 1973లో ‘స్వప్నం’ అనే మళయాళ చిత్రానికి సలీల్‌ చౌదరి సంగీత దర్శకత్వంలో ‘సౌరయుద్ధత్తిల్‌ విదర్నూరు’ అనే పాట పాడారు. ఆ పాట మలయాళంలో మంచి హిట్టయింది. మళయాళ సంగీతదర్శకులు ఎం.కె. అర్జునన్, దేవరాజన్, ఆర్‌.కె. శేఖర్, దక్షిణామూర్తి, బాబురాజ్, శ్యామ్, రవీంద్రన్, కన్నూర్‌ రాజన్, జెర్రీ అమలదేవ్‌ పనిచేసిన సినిమాలకు వాణిజయరాం కొన్ని వేలపాటలు పాడారు. అలాగే కన్నడ చిత్రసీమలో ఎల్‌.వైద్యనాదన్, టి.జి.లింగప్ప, ఉపేంద్ర కుమార్, హంసలేఖ సంగీత దర్శకత్వం నెరపిన వందలాది సినిమాలలో తన గళం వినిపించారు. తెలుగులో కోదండపాణి వాణిజయరాంతో ‘అభిమానవంతులు’ (1974) సినిమాకి ‘ఎప్పటివలె కాదురా నా స్వామీ’ అనే ఒక జావళి పాడించారు. ప్రముఖ కూచిపూడి నాట్యకళాకారిణి పద్మశ్రీ శోభానాయుడు తొలిసారి సినిమాలో ఈ పాటకు నర్తించటం విశేషం. ఇక్కడో విషయం గుర్తు చెయ్యాలి. ప్రముఖ దర్శక నిర్మాత వి.శాంతారాం నిర్మించిన ‘ఝనక్‌ ఝనక్‌ పాయల్‌ బాజే’(1955)లో హీరోయిన్‌ సంధ్యకి ‘జో తుమ్‌ తోడో పియా మై నహీఁ తోడో రే’ అనే మీరా భజన్‌ని సంగీత దర్శకుడు వసంత దేశాయి లతా మంగేష్కర్‌ చేత పాడించారు. ఈ పాటకి పద్మవిభూషణ్‌ శివకుమార్‌ శర్మ సంతూర్‌ వాద్యం వినిపించారు. హిందీ పాటల్లో సంతూర్‌ పరికరాన్ని వాడటం ఈ చిత్రంలోనే మొదలైంది. ఈ పాట బహుజనాదరణ పొందింది. 1979లో గుల్జార్‌ దర్శకత్వంలో వచ్చిన ‘మీరా’ సినిమాలో పాటలన్నీ సంగీత దర్శకుడు పండిట్‌ రవిశంకర్‌ వాణిజయరాంతో పాడించారు. ముఖ్యంగా ‘జో తుమ్‌ తోడో పియా మై నహీఁ తోడో రే’ భజన్‌ ఆమె గళంలో అద్భుతంగా అమరింది. పైగా సంతూర్‌ వాయిద్యానికి బదులు రవిశంకర్‌ సితార్‌ వాయిద్యాన్ని స్వయంగా వాయించటంతో పూవుకు తావి అబ్బినట్లయింది. ఈ పాటకు వాణిజయరాం ‘ఫిలిం వరల్డ్‌ సినీ హెరాల్డ్‌’ బహుమతి అందుకుంది. అందరూ లతా పాటని, వాణిజయరాం పాటని పోల్చి చూసి, వాణి పాడిన పాటే బాగుందని తేల్చారు. ఇదే పాటని యష్‌ చోప్రా నిర్మించిన ‘సిల్‌ సిలా’(1981) చిత్రంలో సంగీత దర్శకులు శివ్‌-హరి మళ్లీ లతా చేత పాడించారు. అక్కడ కూడా లతా పాటకన్నా వాణిజయరాం ఆలపించిన భజనే గొప్పగా వుందని తేలింది.
                                   
‘మీరా’ చిత్రం విడుదలైన తరువాత నుంచి వాణిజయరాంను ‘మీరా ఆఫ్‌ మోడరన్‌ ఇండియా’గా అభివర్ణించడం మొదలైంది. ఈ పాటకు వాణిజయరాం ఉత్తమ గాయనిగా ఫిలింఫేర్‌ బహుమతి కూడా అందుకుంది. లతాజీకి వాణిజయరాం మీద అసూయ పెరిగేందుకు ఇవన్నీ కారణాలయ్యాయి. ఈ రాజకీయాన్ని భరించలేని వాణిజయరాం హిందీ చిత్రసీమకు దూరంగా జరిగింది. అయితే, ఎం.ఎస్‌. విశ్వనాథన్, మహదేవన్, రాజన్‌-నాగేంద్ర, విజయ భాస్కర్, చక్రవర్తి, సత్యం, శంకర్‌-గణేష్, చంద్రబోస్, ఇళయరాజా వంటి సంగీత దర్శకులు వాణిజయరాం ప్రతిభను చక్కగా వినియోగించుకొని, ఆమె గళం ద్వారా తమ పాటలకి వన్నె తెచ్చారు. తమిళంలో ఎం.ఎస్‌. విశ్వనాథన్‌ స్వరం కూర్చిన ‘అపూర్వ రాగంగళ్‌’ (తెలుగులో తూర్పు-పడమర) చిత్రంలో ‘ఏళు స్వరంగళుక్కుళ్‌’ పాటకు 1976లో జాతీయ స్థాయిలో ఆమె ఉత్తమ గాయని ప్రభుత్వ పురస్కారం అందుకున్నారు. తరువాత ఆ అదృష్టం తెలుగు చిత్రాలకే దక్కింది. ‘శంకరాభరణం’ (1980)లో ఆలపించిన ‘బ్రోచేవారెవరురా’, ‘మానస సంచరరే’, ‘దొరకునా ఇటువంటి సేవ’ అనే మూడు పాటలకు సంయుక్తంగా; ‘స్వాతికిరణం’(1991) చిత్రంలో ‘ఆనతినీయరా హరా’ అనే పాటకు వాణిజయరాంకు జాతీయ స్థాయిలో ప్రభుత్వ అవార్డులు దక్కాయి. ఇవి కాక గుజరాత్‌ (ఘూంఘట్‌), తమిళనాడు (అళఘే ఉన్నై ఆరాధిక్కిరేన్‌), ఆంధ్రప్రదేశ్‌ (శంకరాభరణం), ఒడిషా (దేబ్జని) రాష్ట్రాల పురస్కారాలు కోకొల్లలుగా అందాయి. ‘2015లో ఆమె ఫిలింఫేర్‌ జీవన సాఫల్య పురస్కారాన్ని, పి.బి. శ్రీనివాస్‌ అవార్డుని అందుకున్నారు. 1992లో ‘సంగీతపీఠ’ సన్మానాన్ని అందుకున్న అతి పిన్నవయస్కురాలు వాణిజయరాం కావడం విశేషం. తమిళనాడు ప్రభుత్వం వాణిజయరాంకు ‘కలైమామణి’ పురస్కారాన్ని, త్యాగరాజర్‌ భాగవతార్‌ పేరిట ఇచ్చే జీవన సాఫల్య పురస్కారాన్ని, సుబ్రమణ్య భారతి అవార్డును, ఎం.ఎస్‌. సుబ్బులక్ష్మి అవార్డులను ప్రదానం చేసింది. చెన్నైలోని ముద్ర అకాడమీ వారు దక్షిణ భారత దేశంలో అత్యుత్తమ సంగీతాన్ని అందించినందుకు వాణిజయరాంకు ‘ముద్ర అవార్డు’ బహూకరించారు. ఇంకా ఎన్నెన్నో బహుమతులు వాణిజయరాంకు దక్కాయి. ఘంటసాల జాతీయ బహుమతి, దక్షిణ భారత మీరా బహుమతి వాణిజయరాం అందుకున్నారు.

భక్తి పాటల జగధాత్రి...

భక్తి పాటలు పాడటంలో పదిహేనేళ్లుగా వాణిజయరాం మహారాజ్ఞిగా వెలుగొందుతున్నారు. రఘునాథ పాణిగ్రాహి తరువాత జయదేవుని అష్టపదులకు వూపిరినిచ్చిన గాయని వాణిజయరాం. ఆమె దాదాపు 18 భాషల్లో భక్తి గీతాలు ఆలపించారు. సంగీతోత్సవాల్లో వాణిజయరాం పాల్గొని ప్రదర్శనలిచ్చేది. ‘బద్రి కేదార్‌ ఫెస్టివల్‌’, ‘గంగా మహోత్సవ్‌’, ‘వారణాసి ఉత్సవ్‌’, ‘స్వామి హరిదాస్‌ ఫెస్టివల్‌’ వంటి భక్తి ప్రధాన ఉత్సవాల్లో వాణిజయరాంకి ప్రధమ తాంబూలం దక్కేది. ఇక ప్రపంచ వ్యాప్తంగా వాణిజయరాం పాల్గొనని కచేరీలే లేవు. తులసీదాసు, భక్త కబీర్, మీరా, పురందరదాసు, అన్నమయ్య, త్యాగరాజు సంకీర్తనలను సంగీతరూపంలో ముద్రించి భద్రపరిచారు. బ్రిజు మహారాజ్‌తో కలిసి ‘టుమ్రి’ భజనగీతాలు ఆలపించారు. ప్రఫుల్లకర్‌ సంగీత సారధ్యంలో ఒడిస్సీ గురుకులచరణ్‌ మహాపాత్రతో కలిసి ‘గీతగోవిందం’ ఆల్బం కోసం వాణిజయరాం పాడారు. కుమార గంధర్వతో అత్యంత ప్రజాదరణ పొందిన ‘రుణానుబంధచ్య’ అనే మరాఠీ శాస్త్రీయ యుగళాన్ని ఆలపించారు. ఈ పాటకు వాణిజయరాం గురువు వసంతదేశాయ్‌ సంగీతం సమకూర్చారు. ఆమె సొంతంగా స్వరపరచిన ‘మురుగన్‌’ భక్తి గీతాలను ఆల్బంగా విడుదలచేశారు. ‘సినిమా పాటలకి, భక్తి పాటలకి చాలా వ్యత్యాసం ఉంటుందని; భక్తి పాటలకు శ్రుతిని, రాగాన్ని, లయని సవరించుకొని పాడే సౌలభ్యత వుందని, అదే సినిమా పాటలైతే సంగీత దర్శకుడు బాణీ కట్టిన స్థాయిలోనే, ఆర్కెస్ట్రా ప్రాక్టీసు చేసిన స్థాయిలోనే పాడాల్సి ఉంటుందని వాణిజయరాం చెబుతుంటారు. భక్తి పాటలకు ఉచ్చారణ, సందర్భం, నేటివిటీ, రాగ ఛాయలు చాలా ముఖ్యమని, సంస్కృత పదాలను శబ్దాలంకార పూర్వకంగా వుచ్చరించాల్సి ఉంటుందని వాణి అభిప్రాయం. తనకి స్థానిక భాష రాకున్నా, పదోచ్చారణ, భావం అడిగి తెలుసుకొని ప్రాక్టీసు చేసి పాడుతారు. సింగర్‌కి క్లాసికల్‌ బేస్‌ వుంటే రాగ లక్షణాలు అర్థమౌతాయి కనుక మంచి అవుట్‌ పుట్‌ ఇచ్చే అవకాశాలు మెండుగా ఉంటాయని వాణిజయరాం అంటారు. ఇప్పుడు వాణిజయరాం ఎక్కువగా భక్తి గీతాల ఆల్బం రికార్డింగు మీద, శాస్త్రీయ సంగీత కచేరీలు చెయ్యటం పై దృష్టి సారించారు.

తెలుగుదనం నిండిన గళం...

తెలుగులో వాణిజయరాంకు మంచి పేరు తెచ్చిన చిత్రాలు లెక్క కట్టలేం. ‘స్వప్నం’, ‘అంతులేని కథ’, ‘మరోచరిత్ర’, ‘ఘర్షణ’, ‘మల్లెపూవు’, ‘గుప్పెడు మనసు’, ‘ఇది కథ కాదు’, ‘ సీతాకోక చిలక’, ‘పూజ’, ‘శ్రుతిలయలు’, ‘స్వర్ణకమలం’, ‘స్వాతికిరణం’ ఇలా చెప్పుకుంటూ పొతే ఎన్నో. ఆమె ప్రముఖ కథక్‌ మేస్ట్రో పండిట్‌ బిర్జు మహారాజ్‌తో అనేక ఆల్బమ్‌లు చేశారు. పది వేలకు పైగా పాటలు పాడిన వాణిజయరాంకి ‘పద్మ’ పురస్కారం ఇవ్వకపోవటం, పుంభావ సరస్వతిని అవమానించినట్లే భావించాలి. వాణిజయరాం భర్త జయరాం మంచి సితార్‌ వాద్యకారుడు. వీరికి సంతానం లేదు. అందుకే తాము ఆర్జించిన సొమ్మును ఎన్నో సంఘసేవా కార్యక్రమాలకు, అనాధ పిల్ల సంరక్షణకు, చదువులకు వినియోగిస్తుంటారు. వాణిజయరాం చాలా సాధారణంగా వుంటారు. సౌమ్యశీలి. ఇంటి పనుల కోసం ఎవరి మీద ఆధారపడరు. వంటపనులు, ఇంటి పనులు స్వయంగా చక్కదిద్దుకుంటారు. అనారోగ్యంతో వాణి భర్త జయరాం ఇటీవలే కాలం చేశారు. వాణిజయరాం మంచి కవయిత్రి, పెయింటర్‌ కూడా. వాణిజయరాం నిండు నూరేళ్లు జీవించి ఆజన్మాంతం కళాసేవలో తరించాలని ఆశిద్దాం.

వాణిజయరాం అలరించిన కొన్ని తెలుగు పాటలు...

* ఆలోకయే శ్రీ బాల కృష్ణం (తరంగం) ... శ్రుతిలయలు
* అలలు కలలు ఎగసి ఎగసి ... సీతాకోకచిలక
* ఆనతినీయరా హరా ... స్వాతికిరణం
* అందెలరవమిది పదములదా ... స్వర్ణకమలం
* బ్రోచేవారేవరురా (మైసూర్‌ వాసుదేవాచారియర్‌ కృతి)... శంకరాభరణం
* దొరకునా ఇటువంటి సేవ ... శంకరాభరణం
* ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది ... పూజ
* ఇన్నిరాసుల యునికి ... శ్రుతిలయలు
* జాలిగా జాబిలమ్మ రేయి రేయంతా... స్వాతికిరణం
* కురిసేను విరిజల్లులే... ఘర్షణ
* మానస సంచరరే ... శంకరాభరణం
* మిన్నేటి సూరీడు వచ్చెనమ్మా ... సీతాకోకచిలక
* నింగి నేల ఒకటాయెలే ... పూజ
* నువ్వడిగింది ఏనాడైనా లేదన్నానా .. వయసు పిలిచింది
* నువ్వు వస్తావని బృందావని ఆశగా చూసేనయ్యా కృష్ణయ్యా ... మల్లెపూవు
* నేనా పాడనా పాటా ... గుప్పెడు మనసు
* ఒక బృందావనం ... ఘర్షణ
* పూజలు చేయ పూలు తెచ్చాను ... పూజ
* ప్రణతి ప్రణతి ప్రణతి ... స్వాతికిరణం
* సాగర సంగమమే ప్రణయ సాగర సంగమమే ... సీతాకోక చిలక
* శ్రీ సూర్యనారాయణా మేలుకో ... మంగమ్మగారి మనవడు
* శ్రుతినీవు గతి నీవు ... స్వాతికిరణం
* తెలుమంచు కరిగింది తలుపు తీయనా ప్రభూ ... స్వాతికిరణం
* ఏ పాట నే పాడనూ ... సీతామాలక్ష్మి విధిచేయు వింతలన్నీ ... మరోచరిత్ర

- ఆచారం షణ్ముఖాచారి

5, నవంబర్ 2020, గురువారం

AR Rahman melodies


ఏ.ఆర్‌. రెహమాన్‌ అనగానే ‘చిన్ని చిన్ని ఆశ…’ నుంచీ ‘చిట్టి చిట్టి రోబో’ వరకూ ఎన్నో పాటలు మనసుకు స్ఫురిస్తాయి. ఆ పాటల్లో భారతీయత వినిపిస్తుంది. పాశ్చాత్యం వీనుల విందు చేస్తుంది. రెండూ కలగలిసి ఓ నవ్యత ఆవిష్కృతమవుతుంది. రెహమాన్‌ పాటకు ఈ ఏడాదితో పాతికేళ్లు పూర్తయిన సందర్భంగా అతడి బృందం వివిధ నగరాల్లో స్టేజీషోలలో పాటల్ని ఆలపించనుంది. అందులో తొలి అడుగు (నవంబరు 26న) హైదరాబాద్‌లో వేస్తున్న వేళ రెహమాన్‌ గురించి ఆసక్తికరమైన విషయాలు…

రెహమాన్‌ తండ్రి ఆర్‌.కె.శేఖర్‌, తల్లి కస్తూరి. శేఖర్‌ సంగీత దర్శకుడు. శేఖర్‌ తండ్రి ఆలయాల్లో భజనలు చేసేవారు. నాలుగేళ్ల వయసు నుంచే తండ్రి దగ్గర పియానో వాయించడం నేర్చుకున్నాడు రెహమాన్‌. తండ్రి ట్యూన్‌ని అనుకరించడమే కాకుండా, దాన్ని తనకు నచ్చినట్టు మార్చేవాడు కూడా.

* రెహమాన్‌ తొమ్మిదేళ్ల వయసులో తండ్రి చనిపోయాడు. ఆ సమయంలో ఇంట్లోని వాద్య పరికరాలను అద్దెకిస్తూ కుటుంబాన్ని పోషించేది తల్లి. ‘ఆ పరికరాలను అమ్మేయొచ్చుగా’ అని ఎవరైనా సలహా ఇస్తే, ‘మా అబ్బాయి ఉన్నాడుగా’ అని చెప్పేదట. 11 ఏళ్ల నుంచే వేరువేరు సంగీత దర్శకుల దగ్గర అసిస్టెంట్‌గా పనిచేయడం మొదలుపెట్టాడు రెహమాన్‌. 14 ఏళ్లపుడు దూర్‌దర్శన్‌ ‘వండర్‌ బెలూన్‌’ కార్యక్రమంలో నాలుగు కీబోర్డులు ఒకేసారి ప్లేచేస్తూ కనిపించాడు.

* పనిలోపడి రోజూ స్కూల్‌కి వెళ్లలేకపోయేవాడు రెహమాన్‌. దాంతో స్కూల్లో టీచర్లు కోప్పడేవారట. సంగీత దర్శకులంతా సొంత పరికరాలు కొనుక్కోవడంతో కొన్నాళ్లకు వీరి అద్దె పరికరాలకు డిమాండ్‌ తగ్గింది. ఆ సమయంలో ప్లస్‌వన్‌లో ఉన్న రెహమాన్‌ని చదువు మాన్పించి సంగీతంమీదే దృష్టి పెట్టమని చెప్పిందట తల్లి. ఆ విషయంలో రెహమాన్‌కి మొదట్లో అసంతృప్తి ఉండేది. కొంత డబ్బు సంపాదించి మళ్లీ చదువుకోవాలనుకునేవాడు. కాలేజీ చదువులేని లోటు తనను జీవిత పాఠాలు నేర్చుకునేలా చేసిందంటాడు రెహమాన్‌.

* సంగీత దర్శకుడు రమేష్‌ నాయుడు దగ్గర సెకండ్‌ కీబోర్డు ప్లేయర్‌గా పనిచేస్తూ సంపాదించిన డబ్బుతో సొంత వాద్య పరికరాల్ని కొన్నాడు. అవే అతడి భవిష్యత్తుకు పునాది వేశాయి. ఇళయరాజా, రాజ్‌-కోటి మొదలైన వారి బృందాల్లోనూ కీబోర్డ్‌ ప్లేయర్‌గా పనిచేశాడు.

రెహమాన్‌ అయ్యాడిలా

రెహమాన్‌ తల్లికి ఆధ్యాత్మిక భావనలు ఎక్కువ. ఒకప్పుడు వాళ్లింట్లో హిందూ దేవుళ్ల చిత్రాలతోపాటు, మేరీమాత, మక్కా మదీనా చిత్రాలూ ఉండేవి. భర్త చనిపోయిన తర్వాత స్వాంతన కోసం ఆలయాలూ, చర్చిలూ, దర్గాలకు తిరగడం ఎక్కువైంది. నెల్లూరు దగ్గరి తడ ప్రాంతంలో ఉండే సూఫీ ప్రవక్త కరీముల్లా షా ఖద్రీ బోధనలకు ఆకర్షితులై వీరి కుటుంబం సూఫీ వైపు మళ్లింది.

* దిలీప్‌ కుమార్‌ పేరు రెహమాన్‌కి నచ్చేది కాదట. తనలోని వ్యక్తికీ, దిలీప్‌ అనే పేరుకీ పోలికలేదనుకునేవాడు. సూఫీ విధానంలోకి మారకముందే రెహమాన్‌ చెల్లి పెళ్లి విషయమై ఓ జ్యోతిష్కుణ్ని కలవడానికి తల్లితోపాటు వెళ్లినపుడు పేరు మార్చుకోవాలనుకుంటున్నట్టు జ్యోతిష్కుడికి చెబితే, రెహమాన్‌ వైపు చూసి… ‘భలే వింతగా ఉన్నావయ్యా నువ్వు’ అంటూ… ‘అబ్దుల్‌ రెహమాన్‌, అబ్దుల్‌ రహీమ్‌… ఈ రెంటిలో ఏ పేరైనా నీకంతా మంచి జరుగుతుంది’ అన్నాడట. దిలీప్‌కు రెహమాన్‌ పేరు బాగా నచ్చింది. అలా ఓ హిందూ జ్యోతిష్కుడు అతడికి ముస్లిం పేరు పెట్టాడు. ఆ పేరు ముందు అల్లారఖా అని పెడితే బావుంటుందని అతడి తల్లికి అనిపించింది. అలా 23 ఏళ్ల వయసులో దిలీప్‌ కుమార్‌ కాస్తా ‘అల్లా రఖా రెహమాన్‌’ అయ్యాడు. తర్వాత కొన్నాళ్లకు కస్తూరి తన పేరును కరీమా బేగంగా మార్చుకుంది.

* 1990లో రెహమాన్‌కు ‘మల్టీ ట్రాక్‌ రికార్డర్‌’ కొనడం కోసం, కూతురి పెళ్లికని దాచిన తన నగల్ని అమ్మడానికీ వెనకాడలేదు కరీమా. రెహమాన్‌కు ఒక అక్క. ఇద్దరు చెల్లెళ్లు. అక్క కొడుకే యువ సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్‌కుమార్‌. 1987లో చెన్నైలోని కోడంబాకం ఇంటికి వచ్చిన రెహమాన్‌ కుటుంబం, అప్పట్నుంచీ అదే ఇంట్లో ఉంటోంది. ప్రతి శుక్రవారం ఇంటి దగ్గర ఉచితంగా బిర్యానీ పంచుతారు.

ప్రకటనలకు పనిచేశాడు. సినిమాల్లోకి రాకముందే 300 ప్రకటనలకు పనిచేశాడు. మణిరత్నం సోదరి కుటుంబం నిర్వహించే ఓ వాణిజ్య ప్రకటనల సంస్థకు రెహమాన్‌ జింగిల్స్‌ చేసేవాడు. వారి ద్వారానే రెహమాన్‌కు మణిరత్నంతో పరిచయమైంది.

* రోజాకి అందుకున్న మొత్తం రూ.25వేలు. ‘రోజా’ సమయంలో మణిరత్నంకి రెహమాన్‌ తన చిన్న గదిలోని స్టూడియోలో పాటలు వినిపించాడు. పాతికేళ్ల తర్వాత ఈ ఏడాది ‘చెలియా’ ట్యూన్‌లను విమానంలో ప్రయాణిస్తూ వినిపించాడు. ఈ పాతికేళ్లలో మణిరత్నం చేసిన సినిమాలన్నింటికీ సంగీతం అందించింది రెహమానే.

* పాటకి పల్లవి, చరణం ఉండాలన్న సంప్రదాయాన్ని రోజాలోని ‘నాగమణీ’ పాటతోనే చెరిపేశాడు.

ఆరంభం అదిరింది

తొలి చిత్రం ‘రోజా’తోపాటు మెరుపు కలలు, లగాన్‌, అమృత సినిమాలకు ఉత్తమ సంగీత దర్శకుడిగా జాతీయ అవార్డులు అందుకున్నాడు. హిందీలో నేరుగా సంగీతం అందించిన మొదటి సినిమా ‘రంగీలా’.

* కేంద్ర ప్రభుత్వం 2010లో ‘పద్మభూషణ్‌’తో సత్కరించింది.

* రెహమాన్‌కి ముందు వరకూ సినిమా పాట నిర్మాత సొంతం, రెహమాన్‌ వచ్చాక అవి సంగీత దర్శకుల సొంతమయ్యేలా మార్చాడు.

* చిన్న పిల్లలతో పాడించడం ఇష్టం. తన మేనల్లుడి చేత జెంటిల్‌మేన్‌లో ‘చికు బుకు చికు బుకు రైలే’… పాడించాడు. తాజాగా ‘అదిరింది’లోనూ ఓ పిల్లాడితో పాడించాడు.

* రెహమాన్‌కి వాళ్ల నాన్న ఇచ్చిన కీబోర్డ్‌ ఇప్పటికీ అతడి స్టూడియోలో ఉంది.

* కేఎమ్‌ మ్యూజిక్‌ కన్జర్వేటరీ పేరుతో చెన్నైలో ఒక సంగీత పాఠశాలను ప్రారంభించాడు. వీరి స్కూల్లో స్థానిక పాఠశాల విద్యార్థులకు సంగీతంలో ఉచిత శిక్షణ ఇస్తారు.

* కోల్డ్‌ప్లే, అడీల్‌, జయాన్‌ మాలిక్‌ల సంగీతం వింటాడు. ‘ది కార్పెంటర్స్‌’… రెహమాన్‌ కొన్న మొదటి సీడీ.

* 1997లో దేశ స్వాతంత్య్ర స్వర్ణోత్సవాల సందర్భంగా ‘వందేమాతరం’ ఆల్బమ్‌ చేశాడు.

* 2005లో టైమ్‌ మ్యాగజైన్‌ ‘10 బెస్ట్‌ సౌండ్‌ట్రాక్స్‌’ ఆఫ్‌ ఆల్‌ టైమ్‌లో ‘రోజా’ ఒకటి. రెహమాన్‌ను 2009లో ప్రపంచంలో అత్యంత ప్రభావశీల వ్యక్తుల్లో ఒకరిగానూ గుర్తించింది.

* రెహమాన్‌ గౌరవార్థం 2013లో కెనడాలోని ఒంటారియా రాష్ట్రంలో ఒక వీధికి అతని పేరు పెట్టారు. భార్యా పిల్లలు…

రెహమాన్‌ భార్య పేరు సైరాబాను. వీరికి ఇద్దరు అమ్మాయిలు… ఖతిజ, రహీమా, అబ్బాయి అమీన్‌. రెహమాన్‌ పుట్టినరోజైన జనవరి 6నే అమీన్‌ కూడా పుట్టాడు. పిల్లలతో కలిసి వీడియో గేమ్స్‌ ఆడుతూ కాలక్షేపం చేస్తాడు.

* తడ దర్గా ఖద్రీ… సైరాబానును కరీమాకు చూపించి, రెహమాన్‌కు మంచి జోడీ అని చెప్పారట. సైరా కుటుంబం గుజరాత్‌ నుంచి వచ్చి చెన్నైలో స్థిరపడింది. ఆమెకు తమిళం రాదు. ఇంట్లో ఇంగ్లిష్‌లోనే మాట్లాడుతుంది. భర్తతో బైక్‌మీద వెళ్లాలనేది సైరా కోరిక. అది చెన్నైలో తీరలేదు కానీ, ఓ విదేశీ పర్యటనలో తీరిందట.

రజినీ అభిమాని

రాత్రిళ్లు పనిచేయడం రెహమాన్‌కు నచ్చుతుంది. రోజూ ఉదయం 5:30కి ప్రార్థన చేస్తాడు. అర్ధరాత్రి రెండూ మూడు వరకూ ఉండి ఉదయాన్నే మళ్లీ నిద్ర లేవడం కష్టమని అంతవరకూ మేల్కొని ఉండి ప్రార్థన చేసి నిద్రపోతాడు.

తమిళ నీతి పద్య గ్రంథం ‘తిరుక్కురళ్‌’ బాగా చదువుతాడు. బాణీలు రానపుడు ఆ పద్యాల్లో ఒకదానికి బాణీ కడుతూ తనకు కావాల్సింది సృష్టించుకుంటాడు.

* లాస్‌ ఏంజెలెస్‌లో ఒక ఇల్లు ఉంది. పని ఒత్తిడి నుంచి సేదదీరుతూ, సాధారణ వ్యక్తిగా జీవిస్తూ ఆత్మపరిశీలన చేసుకోవడానికీ అక్కడికి వెళ్తానంటాడు.

* రజనీకాంత్‌ అభిమాని. ఆయన నమ్మే చాలా సిద్ధాంతాలనే తనూ నమ్ముతానంటాడు. అనుభవాలనుంచి పాఠాల్ని నేర్చుకోవడం ఆయన్నుంచే తెలుసుకున్నాడట.

* మైఖేల్‌ జాక్సన్‌ని రెండు సార్లు కలిసి మాట్లాడాడు. ఫోన్లో కూడా మాట్లాడుకునేవారట. జాక్సన్‌ని ఇబ్బంది పెట్టకూడదనీ ఫొటో అడగలేదని చెప్పే రెహమాన్‌ అది తీరని కోరిక అంటాడు. ఇద్దరూ కలిసి ఓ ప్రాజెక్టు చేయాలని అనుకున్నారట కూడా!

* సూఫీ సంగీతం నేర్చుకున్నాక తన ప్రపంచం మరింత విస్కృతమైందని చెప్పే రెహమాన్‌… తనపైన గజల్స్‌ గాయకుడు నుస్రత్‌ ఫతే అలీఖాన్‌ ప్రభావం ఉందంటాడు.

* సుభాష్‌ ఘాయ్‌ సూచనతో హిందీ పద్యాలూ, దోహాలను చదువుతూ ఆ భాషపైన పట్టు సాధించిన రెహమాన్‌ తర్వాత ఉర్దూ, పంజాబీ నేర్చుకోవడంపైనా దృష్టిపెట్టాడు.

* ఎయిర్‌టెల్‌ వాణిజ్య ప్రకటన కోసం రెహమాన్‌ స్వరపర్చిన ట్యూన్‌… ప్రపంచంలోనే అత్యధికంగా 15 కోట్ల డౌన్‌లోడ్లు నమోదు చేసింది.

* తన స్టేజి షోలూ, ఇతర లైవ్‌షోల వీడియోలు చూడ్డం మొదలుపెట్టాక తన శైలి మార్చుకున్నానంటాడు రెహమాన్‌. ‘అవి ఎంతో బోరింగ్‌గా అనిపించేవి. నేను స్టేజిమీద కదులుతూ ప్రేక్షకులతో ఇంకాస్త కలిసిపోతే బావుంటుందనిపించింది’ అని చెబుతాడు రెహమాన్‌. మహా సిగ్గరి అయిన రెహమాన్‌ ఓ షోలో స్టేజి దిగి ముందు వరుసలో ఉన్న అమ్మాయిని ‘హౌ మచ్‌ డు యూ లైక్‌ మ్యూజిక్‌? డూ యు లవ్‌ మి?’ అని ప్రశ్నలు వేశాడంటే ఎంత మారాడో అర్థం చేసుకోవచ్చు.

* కాన్సర్ట్‌ల కోసం స్టైలింగ్‌ కూడా మెరుగుపర్చుకున్నాడు. 2010 నుంచి భార్య సైరానే రెహమాన్‌కి స్టైలిస్ట్‌గా ఉంటోంది. కాన్సర్ట్‌కి సిద్ధమవుతూ, యువ మ్యుజీషియన్స్‌ నుంచి కొత్త సాంకేతిక విషయాలు నేర్చుకుంటాడు. ముందు రోజు బాగా నిద్రపోతాడు కూడా, లేదంటే గొంతు సరిగ్గా రాదంటాడు. రెహమాన్‌ సినిమా పాటలూ, లైవ్‌షోలూ, స్టేజి షోలన్నీ కలిసి ‘ఓపెన్‌ హార్ట్‌’ పేరుతో సినిమాగానూ వచ్చింది.

* వర్చువల్‌ రియాలిటీ సినిమా ‘లే మస్క్‌’ తీస్తున్నాడు. భార్యతో కలిసి దీనికి కథ రాసిన రెహమాన్‌, మొదటిసారి దర్శకుడిగా మారాడు.

* ‘బోంబే డ్రీమ్స్‌’ మొదటి అంతర్జాతీయ ఆల్బమ్‌. స్లమ్‌డాగ్‌ మిలీయనీర్‌, పీలే, 127 అవర్స్‌… లాంటి 13 హాలీవుడ్‌ సినిమాలకు సంగీతం అందించాడు. స్లమ్‌డాగ్‌ మిలీయనీర్‌… రెండు ఆస్కార్లూ, రెండు గ్రామీల్నీ, బాఫ్టా, గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డుల్నీ తెచ్చింది. ఒకే ఏడాది రెండు ఆస్కార్లు అందుకున్న ఏకైక ఆసియా వ్యక్తి రెహమాన్‌

అమ్మాయిలు… ఖతిజ, రహీమా, అబ్బాయి అమీన్‌. రెహమాన్‌ పుట్టినరోజైన జనవరి 6నే అమీన్‌ కూడా పుట్టాడు. పిల్లలతో కలిసి వీడియో గేమ్స్‌ ఆడుతూ కాలక్షేపం చేస్తాడు.

* తడ దర్గా ఖద్రీ… సైరాబానును కరీమాకు చూపించి, రెహమాన్‌కు మంచి జోడీ అని చెప్పారట. సైరా కుటుంబం గుజరాత్‌ నుంచి వచ్చి చెన్నైలో స్థిరపడింది. ఆమెకు తమిళం రాదు. ఇంట్లో ఇంగ్లిష్‌లోనే మాట్లాడుతుంది. భర్తతో బైక్‌మీద వెళ్లాలనేది సైరా కోరిక. అది చెన్నైలో తీరలేదు కానీ, ఓ విదేశీ పర్యటనలో తీరిందట.

Feedback on WhatsApp